జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, భారత మార్కెట్లో మరో సరికొత్త స్కూటర్ను విడుదల చేసింది. యమహా ఫాసినో (Yamaha
Fascino) పేరిట కంపెనీ విడుదల చేసిన ఈ 113సీసీ స్కూటర్ కేవలం రూ.52,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే లభ్యం కానుంది.
భారతీయ యువతను లక్ష్యంగా చేసుకొని రిచ్ అండ్ క్లాసీ మోడ్రన్ రెట్రో డిజైన్తో ఈ స్కూటర్ను తయారు చేశారు. ఇందులో 113సీసీ,
4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7 బిహెచ్పిల శక్తిని, 8.1 ఎన్ఎమ్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ
ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
ఈ స్కూటర్ మొత్తం బరువు 103 కిలోలు. దీనిని యమహా బ్లూ కోర్ టెక్నాలజీతో తీర్చిదిద్దారు, ఫలితంగా ఇది లీటరుకు 66 కిలోమీటర్ల
మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఐదు రంగులలో లభిస్తుంది.