కరోనా వైరస్ తగ్గుముఖం పట్టక మునుపే మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త రకం వైరస్ పేరు హంటా వైరస్’Hanta Virus’. ఈ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందే. చైనాలో గుర్తించిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు.
చైనాలో పురుడు పోసుకున్న ఈ వైరస్ ఎలుకల ద్వారా వ్యాప్తి చెందినట్లు అక్కడి వైద్యులు అనుమానిస్తున్నారు. ఎలుక మాంసం తిన్న వ్యక్తుల్లో ఈ వైరస్ పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ ఎంత మంది ఈ వ్యాధి బారిన పడ్డారనే విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు.
ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న చైనాకు కొత్తగా ఈ హంటా వైరస్ అంటుకుంది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లో ఈ వైరస్ పుట్టినట్లుగా తెలుస్తోంది. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్స్ ప్రావిన్స్కి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించాయి, ఆ వ్యక్తితో పాటుగా సుమారు 33 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.
కరోనా వైరస్ సోకితే వ్యాధి బారి నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ హంటా వైరస్ సోకితే క్షణాల్లోనే వ్యక్తులు చనిపోయే ఆస్కారం ఉందట. హంటా వైరస్ సోకిన వ్యక్తి, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు.
ఇకపోతే కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది పైగా ఆస్పత్రిపాలు కాగా దాదాపు 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.