తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఈ మేరకు మంత్రి ఈటెల రాజేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు
తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతిచెందారు. సికింద్రాబాద్, షాద్నగర్కు చెందిన వ్యక్తులు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది.
మరోవైపు కరోనా సోకి కోలుకున్న వారిలో 15 మంది ఈరోజు డిశ్చార్జ్ అవగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది యాక్టివ్ కరోనా పేషెంట్స్ చికిత్స పొందుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.