ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో తెలిపారు. ఈ సమయంలో 217 మంది కరోనా అనుమానిత నమూనాలు పరీక్షించదా అన్ని కూడా నెగిటివ్ ఫలితాలే వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
కర్నూలు-75
గుంటూరు-49
నెల్లూరు-48
కృష్ణా-35
కడప-28
ప్రకాశం – 27
పశ్చిమగోదావరి-22
చిత్తూరు-20
విశాఖపట్నం-20
అనంతపురం-13
తూర్పుగోదావరి-11