అంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ పాటిస్తున్న వేళ బయట కనిపించాడనే నెపంతో పోలీసులు ఓ యువకుడిని చావబాదారు. ఆ దెబ్బలు తాళలేక సదరు యువకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసు దెబ్బలకు ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మెడికల్ షాపులో ఔషధాల కోసం వచ్చిన ఒక యువకుడిని సత్తెనపల్లి చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ దెబ్బలు తాళలేక యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మందుల కోసం పోయిన తన బిడ్డను పోలీసులు కొట్టి చంపారని యువకుడి తండ్రి ఆరోపిస్తున్నారు.