ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రజలంతా ‘కాధా’ అనే పానీయం త్రాగాలని చెప్పారు. ఈ పానీయం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధ వనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో ఈ ఆయుర్వేద పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి.
కావాల్సిన పదార్ధాలు:
తులసి ఆకులు – కొన్ని
యాలకులు – ఒక టేబుల్ స్పూన్,
దాల్చిన చెక్క- ఒక టేబుల్ స్పూన్
శొంఠి – ఒక టేబుల్ స్పూన్
నల్ల మిరియాలు – ఒక టేబుల్ స్పూన్
ఎండుద్రాక్షలు- పది
నీళ్లు- మూడు కప్పులు
నిమ్మరసం- కొద్దిగా
తయారు చేసే విధానం : నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా వేడెక్కాక అందులో సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలపాలి. తర్వాత తులసి ఆకులు, ఎండుద్రాక్షలు కూడా వేసి అయిదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి.
చివరగా దించుకునే ముంది ఇందులో నిమ్మరసం పిండాలి. దీని రుచి ఘాటుగా అనిపించే వారి కోసం ఇందులో కొద్దిగా తేనె లేదా బెల్లం కలపుకోవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా పోరాడే శక్తి శరీరానికి అందుతుంది.