ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 7,782 మంది శాంపిల్స్ పరీక్షించగా అందులో 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1777కు చేరింది.
కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. వీరితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 36కు చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది 729 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ ఆసుపత్రుల్లో 1012 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాల వారీగా కేసుల వివరాలు ఉన్నాయి: