తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో 3 ఏళ్ల కాలపరిమితికి గాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. హిందువులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉందని, దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ మే 29గా నిర్ణయించామని తెలిపింది.
ధరఖాస్తుదారులకు ఏప్రిల్ 1, 2020వ తేదీ నాటికి 40 ఏళ్ల నుండి 55 ఏళ్లలోపు వయోపరిమితి ఉండాలి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలతో పాటు దరఖాస్తు ఫారం కోసం http://www.svbcttd.com వెబ్సైట్ను సందర్శించవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తులను mdsvbc@gmail.comకు మెయిల్ ద్వారా గానీ లేదా “మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి – 517507” అనే చిరునామాకు పోస్టు ద్వారా గానీ పంపవచ్చని టీటీడీ పేర్కొంది.