ఆంధ్రప్రదేశ్ తీరానికి భారీ తుఫాను గండం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని, శుక్రవారం నాటికి ఇది దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
మే 16వ తేదీ సాయంత్రం లేదా 17వ తేదీ ఉదయానికి ఇది తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ తుఫాన్కు ‘ఎంఫాన్’గా నామకరణం చేశారు. తొలుత వాయవ్యంగా, తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫాన్ మరింత బలపడుతుందని వాతావరణ నిపుణులు అంచనా స్తున్నారు.
ఈనెల 17న 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనగాలులు వీస్తాయని, 18న ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిసా తీరం వెంబడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో 15వ తేదీన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఓ మోస్తరు వర్షం, 16న భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.